గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలు ఈనెల 5న యథాతథంగా జరుగుతాయని ఏపీపీఎస్సీ బోర్టు ప్రకటించింది. 5న తెలంగాణ బంద్కు ఓయూ జేఏసీ పిలుపునిచ్చిన నేపథ్యంలో శుక్రవారం ఉదయం ఏపీపీఎస్సీ బోర్డు అత్యవసర భేటీ అయ్యింది. సమావేశం ముగిసిన అనంతరం గ్రుప్-1 పరీక్షలు యథాతథంగా జరుగుతాయని ప్రకటించింది.
కాగా మాదిక దండోరా కార్యకర్తలు ఏపీపీఎస్సీ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. గ్రూప్-1 పరీక్షలు వాయిదా వేయాలని, తెలంగాణ వాటా తేల్చాకే పరీక్షలు నిర్వహించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
అలాగే గ్రూప్-1 ఉద్యోగాల్లో తెలంగాణ వాటాగా 42 శాతం కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ఉదయం ఏబీవీపీ విద్యార్ధులు సచివాలయం ముట్టడికి యత్నించారు. అప్రమత్తమైన పోలీసులు వారి ప్రయత్నాలను మధ్యలోనే అడ్డుకుని ఎక్కడివారిని అక్కడే అరెస్టు చేసి నాంపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు. పోలీసుల జులూం నశించాలని, జై తెలంగాణ అంటూ విద్యార్ధులు నినాదాలు చేశారు.
పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
ఏపీపీఎస్సీ ఈ నె ల ఐదున నిర్వహిస్తున్న గ్రూప్-1 సర్వీసెస్ స్క్రీనింగ్ టెస్ట్ పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్ష న్ విధిస్తున్నట్టు సైబరాబాద్ పోలీసు కమిషన ర్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. పరీక్షా కేంద్రాలకు కిలో మీటర్ చుట్టూ ఈ ఆంక్షలు వర్తిస్తామని పేర్కొన్నారు. ఈ ఆంక్షలను దృష్టిలో పెట్టుకొ ని ఐదుగురికి మించి సంచరించరాదని హెచ్చ రించారు. ఈ ఆంక్షలు ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు అమ లులో ఉంటాయన్నారు.