గ్రూప్-1లో తెలంగాణ వాటా తేల్చనందుకు ఈనెల ఐదవ తేదీన తెలంగాణ బంద్ కు ఉస్మానియా వర్శిటీ విద్యార్ధి జేఏసీ పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా జేఏసీ నేతలు మాట్లాడుతూ ఇప్పటికే ఈ విషయంపై ముఖ్యమంత్రి రోశయ్యకు విజ్ఞప్తులు చేశామని ఇంతవరకు ఎలాంటి స్పందన రాలేదని వారు పేర్కొన్నారు.
ఈనెల 4వ తేదీ లోపల తమకు 42 శాతం కేటాయించి 5న గ్రూప్ -1 పరీక్ష నిర్వహించాలని, లేని పక్షంలో ఆరోజు పరీక్ష ను అడ్డుకుంటామని అన్నారు. ఈ పరీక్షకు తెలంగాణలో ఎవరూ హాజరుకావద్దని, ఒకేవేళ ఎవరైనా పరీక్షలు రాస్తే పేపర్లను చించివేస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వం ఏ నిర్ణయం తెలియజేయకపోతే 5న తెలంగాణ బంద్ జరుగుతుందని వారు తెలిపారు. ఆరోజు బస్సులు, రైళ్ల రాకపోకలు నిలిపివేస్తామని వారు పేర్కొన్నారు.