* త్వరలో పూర్తి వివరాలు
* కేసీఆర్ వల్ల అమరుల కుటుంబాలు రోడ్డున పడ్డాయి
* అసెంబ్లీలో మీడియాతో చెప్పిన మోత్కుపల్లి
కేసీఆర్ కు పోటీగా టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి యాగం చేయనున్నారు. కేసీఆర్ నుంచి తెలంగాణను కాపాడుకునేందుకు త్వరలో చండీ యాగం చేయనున్నట్లు మోత్కుపల్లి నర్సింహులు చెప్పారు. త్వరలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడిస్తామని అసెంబ్లీ ఇన్నర్ లాబీలో మీడియాతో చెప్పారు.
కేసీఆర్ అవలంభిస్తున్న విధానాల వల్ల తెలంగాణలో 700 మంది విద్యార్థులు మృతి చెందారని ఆయన గుర్తు చేశారు. అమరుల కుటుంబాలను రోడ్డు పడేసిన ఘనత కేసీఆర్కే దక్కిందని ఆయన మరోసారి ఫైర్ అయినట్లు తెలుస్తోంది.