తెలంగాణ కుంభమేళా మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు జనం పోటెత్తుతున్నారు. ఇప్పటి వరకే 20లక్షలకు పైగా భక్తులు సమ్మక్క-సారలమ్మను దర్శించుకున్నారు. ఇక వనదేవతలు గద్దెల వద్దకు రాకముందే మేడారంలో హుండీలు నిండిపోతున్నాయి.
భక్తులు సమర్పించిన కానుకలతో ఇప్పటికే మేడారంలో 30 హుండీలు నిండిపోయాయి. దీంతో గిరిజన పూజరులు దేవాదాయశాఖ అధికారులు ఈ హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇలా జాతరకు ముందే హుండీలు నిండటం రికార్డుగా గిరిజన పూజారులు చెబుతున్నారు. ఇక ఈ ఏడాది మేడారం వచ్చే భక్తుల సంఖ్య కోటికి పైగా ఉంటుందని అధికారులు కూడా అంచనా వేస్తున్నారు. దీనికి తగ్గట్టుగానే ఏర్పాట్లు చేశామని చెప్పారు.