రాష్ట్రంలో సాగుతోన్న ఔషధ ప్రయోగాలపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. మనుష్యులపై ప్రయోగాలేంటని న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. మనుషులపై సాగుతోన్న ప్రాణాంతక ఔషధ ప్రయోగాలపై ఓ స్వచ్ఛంద సంస్థ సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసింది. ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు జరపించాలని కోర్టును కోరింది. విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఈ మేరకు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, కేంద్ర ఆరోగ్య శాఖకు సోమవారం నోటీసులు జారీచేసింది. ఆరువారాల్లో నోటీసులకు సమాధానమివ్వాలని న్యాయస్థానం ఆదేశించింది.