రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పశు సంవర్ధక శాఖ పోస్టులను భర్తీ చేస్తామని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ సం చాలకులు వెంకట్డ్డి తెలిపారు. సింగాపూర్ పశువైద్యశాలను వెంకట్డ్డి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్రంలో 609 పశువైద్యాధికారులు, 400 వెటర్నరీ సహాయ పోస్టులను భర్తీ చేయడానికి ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు వ చ్చాయని వెల్లడించారు. పలు పోస్టులకు 15 వర కు గడువుందని, అర్హులైనవారు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. డెయిరీపై 25శాతం, పొ ట్టేళ్లపై 50శాతం, గడ్డి నరికే యంత్రం, పాలు పితికే యంత్రాలను 50శాతం సబ్సిడీపై ప్రభుత్వం అందజేస్తున్నట్లు వెల్లడించారు. మినీ డెయిరీ, పొట్టేలు పిల్లల స్కీములను రైతులు వినియోగించుకోవాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో పశువులకు వైద్యాన్ని అందించేందుకు సిబ్బందిని పెంచుతున్నామని, పశువుల పెంపకంపై అవగాహ న కల్పించడానికి చర్యలు చేపడుతున్నామని పే ర్కొన్నారు. పశువైద్యశాల ఆవరణలో ఉన్న షిప్డిప్ను చూసి ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. అ నంతరం రైతులతో చర్చించారు. వైద్యశాల పనితీ రు అడిగి తెలుసుకున్నారు. ఇన్చార్జి జేడీఏ షేక్ఖలీల్ రహమాన్, కొమురయ్య, పశువైద్యాధికారి మాధవరావు, తదితరులు పాల్గొన్నారు.