శ్రీవారి కైంకర్యంలో 110 తప్పులు ఉన్నాయని, టీటీడీ అధికారులు తప్పులను అంగీకరించిన సీడీ తన వద్ద ఉందని అహోబిలం రామానుజ జీయర్ స్వామి పేర్కొన్నారు. తప్పులు సరిచేసుకోకపోతే సీడీని బయటపెడతానని ఆయన హెచ్చరించారు. తప్పులను మన్నించమని శ్రీవారిని కోరేందుకే భీష్మ ఏకాదశి రోజున పాదయాత్ర చేపట్టనున్నట్లు రామానుజ జీయర్ స్వామి తెలియజేవారు.