వేములవాడ రాజరాజేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణంలో రెండు కోడెలు కొట్టుకుని వీరంగం సృష్టంచాయి. ఈ ఘటనలో నాలుగు దుకాణాలు, రెండు మోటర్సైకిల్లు , ధ్వంసం కాగా పదిమందికి గాయాలయ్యాయి. సోమవారం రథ సప్తమి సందర్బంగా రాజన్నను సందర్శిచడానికి రెండులక్షల మంది భక్తులు వచ్చారు. జాతర బజార్ ప్రాంతంతో ఉదయం 7:30 గంటలకు అకస్మాత్తుగా రెండు కోడెలు కొట్టుకోవడం ప్రారంభించాయి. దీంతో అక్కడున్న భక్తులు పరుగులు తీసారు. పంచాయితీ సిబ్బంది, పోలీసులు వాటిని విడదీయడానికి గంటసేపు శ్రమించారు.