అంబేద్కర్ విగ్రహాల విధ్వంసానికి పాల్పడ్డ అసలైన నిందితులను పట్టుకోవాలని ఎంపీ వివేక్ డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమకారులపై ఘోరమైన కేసులు నమోదు చేసి, విగ్రహాల విధ్వంసానికి పాల్పడ్డ వారిపై చిన్న కేసులు పెట్టడం తగదన్నారు. దళిత సంఘాలు అనుమానిస్తున్న వారిని విచారించాలని డిమాండ్ చేశారు.